లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో, నిరుపేదల ఆకలిని తీర్చడానికి చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ తన వంతు సహాయాన్ని అందించింది. ఈరోజు 37వ డివిజన్లోని “మీ కోసం” కార్యాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్న బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక కుటుంబాలకు ఈ పంపిణీ ద్వారా ఊరట లభించింది. ట్రస్ట్ ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో సన్న బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందజేశారు. ఈ మానవతా కార్యక్రమం ద్వారా అనేకమంది ఆకలిని తీర్చగలిగామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కష్టకాలంలో నిరుపేదలను ఆదుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ