చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, 37వ డివిజన్‌లోని “మీ కోసం” కార్యాలయంలో చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  నేడునిత్యావసర వస్తువుల పంపిణీ  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ మహత్తర కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు గారు మరియు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు హాజరై స్వయంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో  నిరుపేదలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.