కరీంనగర్: మున్నూరు కాపులు రాజకీయంగా మరింత ఎదగాలని, రాజకీయాలను ప్రక్షాళన చేసే స్థాయికి చేరుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపు జనాభా లెక్కలలో స్పష్టత లేదని, అన్ని రంగాల్లోనూ ఈ కులస్తులు వెనుకబడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం కరీంనగర్లో మున్నూరు కాపు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ, పట్టణ అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా మున్నూరు కాపు కులస్తుల లెక్కలను తామే సేకరించి బహిర్గతం చేస్తామన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తులపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలతో ఏసీబీ దాడులు చేసి జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శించారు. మున్నూరు కాపులు వెనుకబడిన కులానికి చెందినవారని ఆయన పునరుద్ఘాటించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్థులు ఐక్యంగా ఉండాలని సూచించారు.
సమావేశంలో తీర్మానాలు:
- ప్రభుత్వం మున్నూరు కాపు కులగణన చేపట్టాలి.
- మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు కల్పించాలి.
- మున్నూరు కాపు అధికారులపై జరుగుతున్న దాడులను ఆపాలి.
- కాచిగూడ పరిధిలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ప్రభుత్వ అధీనం నుండి తీసివేసి ట్రస్ట్కు అప్పగించాలి.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు చల్ల హరిశంకర్, జెన్ వెంకట్, బుక్క వేణుగోపాల్, జిల్లా గౌరవ అధ్యక్షులు గంగుల సుధాకర్, అధ్యక్ష కార్యదర్శులు బొమ్మ రాధా కిషన్, నలువాల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, పురుమళ్ళ శ్రీనివాస్, బొమ్మ రాత్రి రాజేశం, జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, నియోజకవర్గ కోఆర్డినేటర్ మడ్లపల్లి శ్రీనివాస్, గంప వెంకన్న, పొనుగంటి మల్లయ్య, గాజుల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్చార్జులు ముప్పిడి సునీల్, సత్తినేని శ్రీనివాస్, బొల్లం లింగమూర్తి, దామెరకొండ సంతోష్, బండి దీపక్ ప్రశాంత్, మున్నూరు కాపు ఎంపీటీసీఎల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ, డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ, అడ్వకేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ, ఇతర నాయకులు, గ్రామ, మండల, పట్టణ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ